Logo
Date of Publish : 26 November 2022, 3:33 pm
Editor : Sake Naresh

పవన్ కళ్యాణ్ సీఎం కావాలనేదే ప్రజల ఆకాంక్ష : కేతంరెడ్డి వినోద్ రెడ్డి

              నెల్లూరు ( జనస్వరం ) : సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 194వ రోజున 43వ డివిజన్ కుమ్మరి వీధి ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి పరిష్కారం దిశగా పోరాడుతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంలో సీఎం జగన్ రెడ్డి గారి నిరంకుశ విధానాలతో విసిగి వేసారిపోయిన ప్రజలంతా పవన్ కళ్యాణ్ గారి వైపు చూస్తున్నారని, పవనన్నని ముఖ్యమంత్రిగా చేసుకుంటేనే జీవన ప్రమాణాలు మెరుగవుతాయనే నమ్మకంతో ఉన్నారని, ఆ విషయం ఈ ప్రాంతంలో ఇంటింటికీ తిరుగుతుంటే స్పష్టంగా తెలుస్తోందని అన్నారు. రానున్న ఎమ్మెల్యే ఎన్నికలు ఎప్పుడు జరిగినా నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ జెండా రెపరెపలాడడం ఖాయమని అన్నారు. ప్రజలందరి ఆశీస్సులతో గెలిచి నెల్లూరు నగరాన్ని సమగ్ర అభివృద్ధి చేస్తామని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com