పవన్ అంటేనే వైసీపీ వెన్నులో భయం : జనసేన ఏలూరు నియోజకవర్గ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు

          ఏలూరు ( జనస్వరం ) : ఏలూరు, (జనస్వరం) : వైసీపీ వచ్చే ఎన్నికల తర్వాత తట్టా, బుట్టా సర్దేయడమే అని జనసేన ఏలూరు నియోజకవర్గ ఇంచార్జ్ రెడ్డి అప్పలనాయడు హెచ్చరించారు. యువశక్తి సభలో జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై వై.సి.పి మంత్రులు మూకుమ్మడి మాటల దాడి చేయడంపై జనసేనికులు మండిపడుతున్నారు.తమ అధినేత పవన్ అంటే వైసీపీ భయపడుతోందని, చంద్రబాబుతో పవన్ కల్యాణ్ కలిస్తేనే వైసీపీ నేతల ప్యాంటు తడి చిపోయాయని ఇక కలిసి పోటీ చేస్తే ఇక రాజకీయ భవిష్యత్ ఉండదనే భయంతో పవన్ కల్యాన్ ను టార్గెట్ చేశారని జనసేన విమర్శిస్తోంది. మంత్రుల ఎదురుదాడిపై పీఏసీ మెంబర్ నాగబాబు ట్విటర్ జనసేన వేదికగా ట్వీట్ ను ప్రశంసించారు. వైసీపీ మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలు పెట్టారు, వాయినాలు ఇచ్చి పంపండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారన్నారు. ఒక సభ పెట్టి విమర్శలు చేస్తే ఏకంగా మంత్రులు మూకుమ్మడిగా దాడి చేయడం వెనుక ఉద్దేశం అదేనన్నారు. వైసీపీ ఇక తమ ప్రత్యర్థి పవన్ కల్యాణ్ భావిస్తోందా..? అంటే అవుననే సమాధానం జనసేన నుండి వినిపిస్తోంది. జనసేన అధినేత పవన్. కల్యాణ్ బయటకు వచ్చి ఏ పర్యటన చేసినా వైసీపీ మంత్రులు దగ్గర నుంచి ఎమ్మెల్యేలు, ఎంపీలు వరుసగా మాటల దాడి చేస్తున్నారని, అంతేకాదు‌ యువశక్తి బహిరంగ సభలలో అయితే ఏకంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రస్తావనే లేకుండా పవన్ కల్యాణ్ ప్రసంగమే లేదన్నారు. దీంతో పవన్ కల్యాణ్ తమ రాజకీయ ప్రత్యర్థిగా వైసీపీ భావిస్తుందన్నారు. అంతే కాదు భవిష్యత్లో వైసీపీని బలంగా ఢీకొట్టే వ్యక్తి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే ఆన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way