Search
Close this search box.
Search
Close this search box.

జనం కోసం పవన్ – పవన్ కోసం మనం కార్యక్రమం

పవన్

             కాకినాడ ( జనస్వరం ) : కరప మండలం పెదకొత్తూరు గ్రామం లో గ్రామ జనసేన పార్టీ అధ్యక్షులు అల్లు గంగాద్రి గారి ఆధ్వర్యంలో జనం కోసం పవన్ -పవన్ కోసం మనం కార్యక్రమం ద్వారా ఇంటింటికి పాదయాత్ర చేస్తూ జనసేన పార్టీ PAC సభ్యులు, కాకినాడ రూరల్ ఇంచార్జ్ పంతం నానాజీ సమస్యలు తెలుసుకున్నారు. పెద్దకొత్తూరు గ్రామంలో డ్రైనేజీ వ్యవస్థ అస్థవ్యస్థంగా ఉంది. ( కాలువలు పూర్తిగా లేవు) త్రాగు నీటి, మంచి నీరు వచ్చే సమయం సరిగాలేదని అన్నారు. స్మశానంలో  సరైన సదుపాయాలు లేవు. వర్షం వస్తే దహన సంస్కారాలు చేయటంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. రైసు మిల్లుల పొల్యూషన్ వలన మంచి నీళ్ళుతాగే నుయ్యి మొత్తం పాడయి పోయింది. RBKల ద్వారా రైతులకు ఎటువంటి ఉపయోగం లేదు. RBK సెంటర్లు YCP కార్యాలయాలగా మారి పోయాయని ఆవేదన వ్యక్తం చేశారు.  YCP గ్రామ కన్వీనర్లు ధాన్యం కొనుగోలు చేసి కమిషన్ ఏజంట్లుగా పనిచేస్తున్నాడు. ప్రభుత్వ అధికారుల నిర్లక్షం. కారణంగా వరికి బదులుగా సన్నాలుగా ఈ క్రాప్స్ నమోదు చేయడంతో ఈ ధాన్యాన్ని కొనుగోలు చేయడం లేదు. వారి పొలాల నుండి RBK సెంటర్ కి ధాన్యాన్ని తరలించేందకు రవాణా ఖర్చులు చెల్లించడం లేదు. తడిసిన ధాన్య, మొక్కలు వచ్చిన ధాన్యం విషయంలో రైతులకు సరైన న్యాయం చేయాలని, గిట్టిబాటు ధర కల్పించాలి. డ్వాక్రా మహిళలు! రుణాలు మంజూరు కాలేరు. బటన్ రెడ్డి బటన్ నొక్కి 45 రోజులు దాటింది. ఈ కార్యక్రమం లో స్థానిక జనసేన నాయకులు, కరప మండల నాయకులు, కాకినాడ రూరల్ మండల నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way