Logo
Date of Publish : 03 December 2021, 1:14 pm
Editor : Sake Naresh

అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను పరిశీలించిన పత్తికొండ జనసేన నాయకులు రాజశేఖర్

    పత్తికొండ, (జనస్వరం) : కర్నూలు జిల్లా  పత్తికొండ నియోజకవర్గము మద్దికేర మండలంలో అధిక వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలను జనసేన నాయకులు రాజశేఖర్ పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  గత 25 రోజుల నుండి ఎడతెరపి లేకుండా కురిసిన అధిక వర్షాలకు పత్తికొండ, మద్దికేర మండలాల్లో పంటలు పూర్తిగా దెబ్బతిని పొలంలోనే కుళ్ళిపోవడం జరిగిందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్తామని, కరువు సహాయక నిధులు విడుదల చేసి రైతాంగాన్ని ఆదుకునే అంతవరకూ జనసేన పార్టీ తరఫున పోరాడతామని రైతులకు భరోసా ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఉల్లి, పత్తి, మిరప పంటలకు ఎకరాకు 60 వేల రూపాయలు పెట్టుబడి పెట్టారు. కానీ వారికి ఒక్క రూపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. పప్పు శనగ, వాము పంటలకు ఎకరాకు 40000 వేల రూపాయల చొప్పున నష్టం జరిగిందని తెలిపారు. పంటలు నష్టపోయిన రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం ఇవ్వాలని జనసేన పార్టీ తరుపున  ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు, రావుల అంజి, అనిల్, వీరేష్, చిన్న, పెండేకల్ రవి, జయరాముడు, జీవన్ కుమార్, పులి శేఖర్ మరియు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com