మదనపురం గ్రామ పంచాయతీలో జనసేన జెండాను ఆవిష్కరించిన పాతపట్నం జనసేన అభ్యర్థి గేదెల చైతన్య
శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గం, కొత్తూరు మండలం మదనపురం గ్రామ పంచాయతీలో జనసేన జెండా దిమ్మను పాతపట్నం నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే అయిన శ్రీ చైతన్య గారు ఆవిష్కరించడం జరిగింది.. చైతన్య గారు మాట్లాడుతూ "గ్రామ పొలిమేరల్లో టిడిపి తల్లి పిల్ల కాంగ్రెస్ పార్టీ జెండా దిమ్మలు ఉండటం సహజం.. వాటికి దీటుగా, బలమైన పార్టీగా జనసేన మారుతుంది. "పల్లెపల్లెకు జనసేన" కార్యక్రమంలో భాగంగా చైతన్య గారు మదనాపురం పంచాయితీ కి వెళ్ళడం జరిగింది. అలాగే కార్యకర్తలతో మాట్లాడుతూ పార్టీని బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరూ కూడా జనసేన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరారు. 2024 కల్లా జనసేన జెండాను ఎగురెయ్యాలనే లక్ష్యంగా ప్రజల్లోకి బలంగా వెళ్దామన్నారు.
