పాతకోట, రేగం రహదారులను త్వరగా నిర్మించాలి

పాతకోట

        అనంతగిరి ( జనస్వరం ) : పాతకోట, రేగం రహదారులను త్వరగా నిర్మించాలని జనసేన పార్టీ మురళి డిమాండ్  చేశారు. ఈ సందర్బంగా మురళి మాట్లాడుతూ అనంతగిరి మండల కేంద్రము నుండి మాలింగ వలస, పాతకోట, రేగo, నందిగుమ్మి, మద్ది గరువు, వయా పెదబయలు గ్రామాలను అనుకొని నిర్మిస్తున్న రోడ్డును త్వరగా పూర్తి చేయాలని, నాణ్యతతో రోడ్డు నిర్మించాలని అనంతగిరి జనసేన పార్టీ నాయకులు, మురళి, నవీన్, ప్రవీణ్. రామారావు విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. గత ప్రభుత్వ హాయంలో ఈ రింగ్ రోడ్డు కొరకు నాలుగు కోట్ల ఎనభై ఆరు లక్షల రూపాయలు మంజూరయ్యాయని అప్పటి అధికారులు కాంట్రాక్టర్లు కలిసి రోడ్డు మధ్యలో వదిలేసి నిధులన్నీ కాజేశారని అన్నారు. అలాగే మధ్యలో కల్వర్టు కూడా నిర్మించకుండా వదిలేయడంతో ఆయా గ్రామాల గిరిజనులు నిత్యావసర సరుకుల కోసం మండల కేంద్రానికి రావటానికి నానా అవస్థలు పడుతున్నారని అన్నారు. అత్యవసర వైద్య సేవలు నిమిత్తం ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయత్నిస్తున్నారని నాయకులు విమర్శించారు. ఇప్పటికైనా ఈ రింగ్ రోడ్డు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే మండల కేంద్రానికి రావటానికి సుమారుగా ఒక వంద గ్రామాల గిరిజనులకు సమయం ఆదా అవుతుందని అన్నారు. సుమారుగా ఒక 30 కిలోమీటర్లు మండల కేంద్రానికి రావటానికి దగ్గరవుతుందని నాయకులు తెలిపారు. జగన్ ప్రభుత్వం వచ్చి నాలుగు సంవత్సరాలు గడిచినప్పటికీ రోడ్డు పనులు జరగకపోవడంతో గిరిజనులపై జగన్ సవతి ప్రేమ చూపిస్తున్నారని నాయకులు విమర్శించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో జనసేన పార్టీ నాయకులు అధికంగా పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way