Search
Close this search box.
Search
Close this search box.

పార్వతీపురం – సీతానగరం జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన విస్కృత స్థాయి సమావేశం ఏర్పాటు

పార్వతీపురం

            పార్వతీపురం నియోజకవర్గ నాయకులు సీతానగరం పార్టీ కార్యాలయంలో విస్కృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పార్వతీపురం, సీతానగరం, బల్జిపేట మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, జన సైనికులు మరియు వీర మహిళలలు పాల్గొనడం జరిగింది. వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంలోనూ, ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ, పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేయడంలోనూ, వైసీపీ గూండాలను తరిమి కొట్టడంలోను.. మనదంతా ఒకే మాట – ఒకే బాట అనే నినాదంతో ముందుకు వెళ్లాలని తీర్మానం చెయ్యడం జరిగింది. మనస్పర్థలకు చోటు లేకుండా ఐక్యమత్యంతో అంచెలంచెలుగా ఎదిగి ప్రణాళిక బద్దంగా పని చేసి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేసి పార్వతీపురం నియోజక వర్గంలో జనసేనానిని గెలుపించుకొని పవన్ కళ్యాణ్ గారికి బహుమతిగా ఇద్దాం – పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేద్దామని ఇలుపునిచ్చారు. అలాగే కొద్ది రోజులుగా ఈ రౌడీ వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి పర్యటనలను అడ్డుకోవడం, ఆయనపై హత్యా ప్రయత్నాలు జరుగుతున్న మౌనంగా ఉండటం, పవన్ కళ్యాణ్ గారికి అండగ నిలిచిన ఇప్పటం గ్రామ ప్రజల ఇళ్ళను కక్షపూరితంగా కూల్చేయడం, వాళ్ళకి అండగా నిలవడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవడం పై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహం వద్ధ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నిరసన తెలుపుతూ నినాదాలు చెయ్యడం జరిగింది. కు పార్టీ మీద ఉన్న ప్రేమతో నియోజక వర్గ నలుమూలల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నామని తెలియజేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way