
శేరిలింగంపల్లి, మార్చి 29 (జనస్వరం) : రంగారెడ్డి అర్బన్ జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం మియాపూర్లోని శ్రీ చైతన్య కళాశాలలో పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ మహాభియాన్-2026 శిక్షణా తరగతులు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాజ్యసభ సభ్యుడు, బీజేపీ జాతీయ ఓబీసీ మోర్చా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ ఈ కార్యక్రమాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దీన్ దయాళ్ ఉపాధ్యాయ అంత్యోదయ సిద్ధాంతం ప్రతి కార్యకర్తకు ప్రేరణ కావాలని, పార్టీ సిద్ధాంతాలపై పూర్తి అవగాహనతో ప్రజల్లోకి వెళ్లి బీజేపీని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. సేవా భావంతో పనిచేస్తూ సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి అర్బన్ జిల్లా అధ్యక్షుడు వనిపల్లి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ప్రభారి ఆలే భాస్కర్, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్ యాదవ్, ములుగు జిల్లా ఇంచార్జి డాక్టర్ నరేష్, సీనియర్ నాయకుడు బాల్డా అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శులు మహిపాల్ రెడ్డి, బోల్గాం యశ్పాల్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు మరియు ఇతర కార్యకర్తలు పాల్గొన్నారు.