కర్నూలు నగరంలో జనసేనపార్టీ కార్యాలయంపై దాడిని ఖండించిన పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు

● ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం.
● అధికార పార్టీకి జనసేన అంటే ఎందుకంత భయం.
● జనసేన పార్టీ కర్నూలు జిల్లా నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇంఛార్జ్ చింతా సురేష్ బాబు.

      కర్నూలు, (జనస్వరం) : కర్నూలు నగరం గణేష్ నగర్ లోని మేయర్ కార్యాలయం ఎదురుగా ఉన్న జనసేన పార్టీ మహిళా విభాగ కార్యాలయంపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న కర్నూలు జిల్లా నాయకులు పాణ్యం నియోజకవర్గ ఇంచార్జ్ చింతా సురేష్ బాబు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ జనసేన పార్టీ రాయలసీమ వీరమహిళ కమిటీ మెంబర్ హసీనా బేగం కార్యాలయంపై అధికార ప్రోద్బలంతో గుర్తు తెలియని 15 మంది వ్యక్తులు దాడి చేసి కార్యాలయంలోని సామాగ్రిని ధ్వంసం చేసి బయట పడేసి తాళాలు వేశారు. బిల్డింగ్ ఓనర్ ను సంప్రదించగా ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. ఈ దుస్సాహసానికి పాల్పడిన వ్యక్తులను కనిపెట్టి తగిన చర్యలు తీసుకోవాలని చింతా సురేష్ బాబు డిమాండ్ చేశారు. రాయలసీమ వీర మహిళ కమిటీ సభ్యురాలు శ్రీమతి హసినా బేగం జనసేన పార్టీ నాయకులు మహబూబ్ బాషా, నక్కలగుట్ట శ్రీనివాసులు, విశ్వనాధ్, మంజునాథ్, సుధాకర్, బజారి, శ్రీనివాసులు కార్యకర్తలు కర్నూలు మూడవ పట్టణ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. దాడికి సంబందించిన సిసి కెమెరా వీడియో కాపిని పోలీసులకు అందజేసి మాకు తగిన న్యాయం చేయాలని మూడో పట్టణ సీఐ, పోలీస్ అధికారులను కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way