సిబిఐ దత్త పుత్రుడికి పామర్రు నియోజకవర్గం జనసేన నాయకుల సవాల్

పామర్రు

            పామర్రు ( జనస్వరం ) : జనసైనికులు రాజా మైలవరపు గారి టీం పిడికిలి వారు వితరణ చేసిన, జనసేన పార్టీ యొక్క రైతు భరోసా యాత్ర గూర్చి మరియు రైతులు పండించిన పంటకు లాభసాటి ధర గూర్చిన ఆటో స్టికర్లు మరియు గోడ ప్రతులు ఆవిష్కరణ చేశారు. కృష్ణా జిల్లా కార్యక్రమాల నిర్వహణ కమిటీ సభ్యులు పచ్చిగళ్ళ సుధీర్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం నందు, నియోజకవర్గం ఇంచార్జి తాడిశెట్టి నరేష్ గారి చేతుల మీదుగా ఆవిష్కరణ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మరణించిన కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఆదుకుంటుంటే, ప్రభుత్వం ఎందుకు ఉలిక్కి పడుతుంది. మేము సహాయం చేస్తున్న వారు కౌలు రైతులు కాదని వైసీపీ నాయకులకు, సిబిఐ దత్త పుత్రుడికి నిరూపించే దమ్ముందా అని సవాల్ విసిరారు. కార్యక్రమంలో రాపర్ల ఎంపీటీసీ కూనపరెడ్డి సుబ్బారావు, నియోజకవర్గం చిరంజీవి యువత అధ్యక్షులు పంచకర్ల సందీప్, ఎర్రంశెట్టి వీరాస్వామి మరియు జనసైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way