Search
Close this search box.
Search
Close this search box.

గిరిజన గ్రామాల్లో పర్యటించిన పాలకొండ జనసేన నాయకులు

      పాలకొండ, (జనస్వరం) : పార్వతీపురం మన్యం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, వీరఘట్టం మండలం సవర గోపాలపురం, సవర గూడ గిరిజన గ్రామాలో గిరిసేన జనసేన – జనం వద్దకు జనసేన అనే కార్యక్రమన్ని ప్రారంభించారు. గిరిజన నియోజకవర్గమైన పాలకొండలో అనేక మారుమూల గిరిజన ప్రాంతాల్లో పర్యటించి జనసేన పార్టీ బలోపేతం చేసేందుకు మొదటి దశగా వందరోజుల కార్యక్రమానికి వీరఘట్టం మండలం జనసేన పార్టీ నాయకులు శ్రీకారం చుట్టారు. గిరిజన ప్రాంతాల్లో – గుడిసె గుడిసెకు జనసేనపార్టీ మ్యానిఫెస్టో, సిద్దాంతాలు గిరిజన ప్రజలకు అర్ధమైన రితీలో జనసేన నాయకులు మత్స పుండరీకం, జనసేన జాని, కర్ణేన సాయి పవన్ వివరించారు. ఈ సందర్భంగా మత్స పుండరీకం మాట్లాడుతూ సంవత్సరానికి ఐదు నుండి ఎనిమిది గ్యాస్ సిలిండర్ల ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. తెల్లరేషన్ కార్డుదారులకు ఇల్లు కట్టుకోవడానికి ఇసుక ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది. వ్యవసాయం చేసిన రైతులకు ఐదు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం జనసేన పార్టీ కల్పిస్తుందని తెలిపారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ప్రజల పక్షాన నిలబడిన నాయకుడు. అలాంటి నాయకుడుని ముఖ్యమంత్రిని చేయాల్సిన బాధ్యత మన అందరిపైన ఉంది అని మత్స పుండరీకం పిలుపునిచ్చారు. అలాగే జనసేన జాని మాట్లాడుతూ మేము ప్రతి ఇంటి ఇంటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలిసి ముఖ్యంగా మహిళలకు అర్ధమైన రీతిలో జనసేన పార్టీ మేనిఫెస్టో వివరించడం జరిగింది. గిరిజన ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి జనసేన పార్టీ సిద్ధాతాలు గురించి వివరంగా చెప్పడం జరిగింది. గిరిసేన – జనసేన కార్యక్రమం ద్వారా ప్రజలునుండి అపూర్వమైన స్పందన లభిస్తోందన్నారు. గిరిజన ప్రాంతాల్లోని ప్రజలు గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన పాపానికి నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటాయని, రేషన్ బియ్యం మాత్రం ఇస్తున్నారు ఇంకేమి ఇవ్వడం లేదని, గిరిజన ప్రాంతాల్లో పండించే పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అలాగే స్థానికంగా పనులు లేక సుదూర ప్రాంతలకు వలసలు వెళ్లిపోతున్నము అని గిరిజన మహిళలు జనసైనికులకు చెప్పారు. వీటికి జనసైనికులు సమాధానం ఇస్తూ జనసేన పార్టీ మేనిఫెస్టోలో గిరిజన ప్రాంతాల్లోని ఆహార పంటలుకు, గిరిజన ఉత్పతులు తయారు చేసేoదుకు స్థానికంగా ఉంటూ ఉద్యోగ, ఉపాధి కల్పన కల్పిస్తుంది అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో *గాజుగ్లాస్* గుర్తుకి మీ అమూల్యమైన ఓటును వేసి జనసేన పార్టీ గెలిపించాలని గిరిజన మహిళలను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యులు దూసి ప్రణీత్, గేదల రవి, నిమ్మక చిన్న, కోడి వెంకటరావు నాయుడు, వావిలపల్లి నాగభూషన్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way