Search
Close this search box.
Search
Close this search box.

కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలిచిన పవన్ కళ్యాణ్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పాడేరు జనసేన నాయకులు

     పాడేరు, (జనస్వరం) : ఇటివలే రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు అండగా నిలచి వాళ్లకు అండగా నిలబడి ఆయన కష్టజీతం అయినటువంటి 5 కోట్ల రూపాయలు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఇవ్వడం జరిగింది. అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం చేయవలసిన పని పవన్ కళ్యాణ్ గారు చేయడం గర్వించదగ్గ విషయం. అందుకనే ఆయన రైతులకు అండగా నిలబడిన పవన్ కళ్యాణ్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. అలాగే ప్రభుత్వాన్ని జనసేనపార్టీ తరుపున ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఆత్మహత్యలకి గురి అయ్యిన రైతులకు తక్షణమే నిధులు కేటాయించి, అన్నం పెట్టే రైతులకు న్యాయం చేయాలని జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రానున్న రోజులలో రైతులకు న్యాయం జరగలేని మరుక్షణం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నిరసన కార్యక్రమం బలంగా ముందుకు తీసుకొనివెళ్తాము అని మరొక సారి తెలియజేస్తున్నాం. అలాగే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి కార్యక్రమంలో ప్రతి జనసైనికుడు, వీరమహిళలు కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటామని తెలియజేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాడేరు జనసేన పార్టీ మండల అధ్యక్షులు నందోలి.మురళీకృష్ణ, అరకు పార్లమెంట్ ఎక్ససిక్యూటివ్ కమిటీ మెంబెర్ కొర్ర.కమల్ హసన్, పాడేరు అధికార ప్రతినిధి బొనుకుల.దివ్యలత, కాకినాడ రూరల్ క్రియాశీలక సభ్యుడు సీ హెచ్. అనిల్ కుమార్, మణికంఠ, పవన్, సత్తిబాబు, రాజు, బాలకృష్ణ, శంకర్ తదితరులు పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way