
విశాఖ, (జనస్వరం) : విశాఖ జిల్లా జనసేన పార్టీ పాడేరు నియోజకవర్గం జీ. మాడుగుల మండలం, కొరపల్లి పంచాయతీ, రూడుబయలు, గ్రామంలో “జనంకోసం జనసేన” అనే నినాదంతో. డా!!వంపురూ గంగులయ్యగారి ఆదేశాలు మేరకు గ్రామంలో ప్రజలు మంచి నీరు సదుపాయం లేక అల్లాడిపోతున్నారు. కలుషిత వాటర్ తాగి అనారోగ్యానికి గురి అవుతున్నారని అలాగే గ్రామంలో గిరిజనులు చాలా దిగ్బంతికి గురి అవుతున్నారని అన్నారు. వైసీపీ గవర్నమెంట్ తక్షణమే స్పందించి నీటి కుళాయిలు వేసి భాదితులకు అనారోగ్యానికి గురి కాకుండా చూసుకునే బాధ్యత వైసీపీ పార్టీకి ఉంది. బాధితులకు అండగా ఉండి న్యాయం చేయాలని జనసేన పార్టీ ద్వారా మేము డిమాండ్ చేస్తున్నామని అన్నారు. అలాగే బాధితులకు ఆ గ్రామస్తులకు న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని జనసేన పార్టీ అండగా ఉంటాదని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పాడేరు జీ. మాడుగుల మండల నాయకులు మసాడి. సింహాచలం గారు ex. ఎంపీటీసీ, అలాగే పాడేరు జనసేన పార్టీ మండల ప్రెసిడెంట్ నందోలి మురళి క్రిష్ణ గారు, పి. ప్రసాద్ అలాగే రాజు, చంద్ర, జనసేన పార్టీ కాకినాడ రూరల్ జనసేన పార్టీ క్రియశీలక సభ్యుడు.అనిల్ కుమార్, వెంకట రమణ sfi తదితరులు పాల్గొన్నారు.