ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం : జనసేన కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి

అంబటి సుధారాణి

           దాచేపల్లి ( జనస్వరం ) : ఎన్నో సంవత్సరాలు గా నీళ్ళ కోసం పడిగాపులు కాస్తున్న ఎనిమిదో వార్డులోని దక్షిణ గడ్డ బజారు ప్రాంత ప్రజలకు కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి చొరవతో సమస్యలు తీరాయి. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అందిన వినతులు అన్నిటికీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నామని, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టామని జనసేన కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి అన్నారు. అందులో భాగంగానే దక్షిణగడ్డ మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను కౌన్సిల్ సమావేశాల్లో ఏకరువు పెట్టి శాశ్వత పరిష్కారం చూపాలని పట్టు బట్టి మరీ బోర్ వెల్ ఏర్పాటుకు కృషి చేశామన్నారు. బోర్ వెల్ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను తెలియజేయగానే మా ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీవిద్య గారికి, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇవే కాకుండా వార్డులో అనేక సమస్యలు నెలకొని వున్నాయని వాటిని కూడా కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి త్వరితగతిన పరిష్కార మార్గం చూపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల్లో మాత్రమే చేయాలని అనంతరం అభివృద్ధి ధ్యేయంగా పని చేయాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way