Search
Close this search box.
Search
Close this search box.

ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే మా లక్ష్యం : జనసేన కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి

అంబటి సుధారాణి

           దాచేపల్లి ( జనస్వరం ) : ఎన్నో సంవత్సరాలు గా నీళ్ళ కోసం పడిగాపులు కాస్తున్న ఎనిమిదో వార్డులోని దక్షిణ గడ్డ బజారు ప్రాంత ప్రజలకు కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి చొరవతో సమస్యలు తీరాయి. ఎన్నికల ప్రచారంలో ప్రజల నుంచి అందిన వినతులు అన్నిటికీ ఒక్కొక్కటిగా పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తున్నామని, ముఖ్యంగా మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్యపై ప్రధానంగా దృష్టి పెట్టామని జనసేన కౌన్సిలర్ అంబటి సుధారాణి స్వామి అన్నారు. అందులో భాగంగానే దక్షిణగడ్డ మహిళలు ఎదుర్కొంటున్న నీటి సమస్యను కౌన్సిల్ సమావేశాల్లో ఏకరువు పెట్టి శాశ్వత పరిష్కారం చూపాలని పట్టు బట్టి మరీ బోర్ వెల్ ఏర్పాటుకు కృషి చేశామన్నారు. బోర్ వెల్ ఏర్పాటు యొక్క ఆవశ్యకతను తెలియజేయగానే మా ప్రతిపాదనను ముందుకు తీసుకువెళ్లేలా చర్యలు నగర పంచాయతీ కమిషనర్ శ్రీవిద్య గారికి, చైర్మన్ గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఇవే కాకుండా వార్డులో అనేక సమస్యలు నెలకొని వున్నాయని వాటిని కూడా కౌన్సిల్ సమావేశాల్లో ప్రస్తావించి త్వరితగతిన పరిష్కార మార్గం చూపేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ఎన్నికల్లో మాత్రమే చేయాలని అనంతరం అభివృద్ధి ధ్యేయంగా పని చేయాలని ఆమె ఆకాంక్షించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way