Logo
Date of Publish : 20 May 2026, 6:17 pm
Editor : Sake Naresh

ఘనంగా ప్రారంభమైన ఓపీఎల్ సీజన్-7 క్రికెట్ టోర్నమెంట్

విశాఖపట్నం, మే 20 (జనస్వరం) : “మద్యం వద్దు… మైదానం ముద్దు” అనే సందేశంతో ఓజీపీటీ కింగ్ మేకర్స్ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహించే ఓపీఎల్ (ఓల్డ్ గోపాలపట్నం ప్రీమియర్ లీగ్) సీజన్-7 క్రికెట్ టోర్నమెంట్ ఈ ఏడాది కూడా పరదేశమ్మ తల్లి అమ్మవారి పండుగ సందర్భంగా ఘనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన నాయకులు, 91వ వార్డు అధ్యక్షులు సంగం నరేంద్ర హాజరై టోర్నమెంట్ ట్రోఫీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత క్రీడల వైపు ఆకర్షితులై ఆరోగ్యకరమైన జీవన విధానాన్ని అలవర్చుకోవాలని సూచించారు. మద్యం వంటి చెడు అలవాట్లకు దూరంగా ఉండి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. టోర్నమెంట్‌లో మొత్తం ఆరు ఫ్రాంచైజీ యజమానులు పాల్గొని ఆటగాళ్లను వేలం ద్వారా ఎంపిక చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. యువతలో స్నేహభావం, క్రమశిక్షణ, ఐక్యత పెంపొందించేందుకు ఈ పోటీలు దోహదపడతాయని పేర్కొన్నారు. జూన్ 6, 7 తేదీల్లో మ్యాచ్‌లు ఉత్సాహభరితంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. టోర్నమెంట్ విజేతలకు అమ్మవారి పండుగ రోజు ఘనంగా బహుమతులు అందజేయనున్నట్లు వెల్లడించారు. స్థానిక యువత పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com