Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ పార్టీ వాళ్లకి మాత్రమే గుండెల్లో వణుకు పుడుతోంది

వైసీపీ

    ధర్మవరం ( జనస్వరం ) : జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి తన స్వగృహంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా ముఖంగా మాట్లాడుతూ జనసేన, టిడిపి పొత్తు శుభపరిణామమని ఈ రాష్ట్ర ప్రయోజనాల కోసం జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయాన్ని స్వీకరిస్తున్నామని అన్నారు. ప్రజలంతా కూడా స్వాగతిస్తున్నారని కేవలం వైసీపీ పార్టీ వాళ్లకి మాత్రమే గుండెల్లో వణుకు పుడుతుందని ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి కి పవన్ కళ్యాణ్ ని విమర్శించే స్థాయి తనకు లేదని అన్నారు. ఓటమి భయంతో దిక్కుతోచని పరిస్థితిలో అవాకులు చవాకులు పేలుతున్నాడని అలాగే రోజా మీ జగన్ రెడ్డి లక్ష కోట్ల ఆర్థిక నేరస్తుడని అది మరచి నువ్వు పవన్ కళ్యాణ్ ని విమర్శిస్తున్నావన్నారు. నువ్వు మీ ప్రభుత్వమే ఒక ఆర్థిక నేరగాల్ల ప్రభుత్వమని వైసీపీ పార్టీ వాళ్లకి మతిభ్రమించి పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని తీవ్రంగా మండిపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way