
ఒంగోలు ( జనస్వరం ) : వర్షం కారణంగా ఇబ్బంది పడుతున్న శివారు ప్రాంతాలైనా జాషువా కాలనీ, పులి వెంకట్ రెడ్డి కాలనీ, ఇందిరమ్మ కాలనీ, బలరాం కాలనీలో జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలు మేరకు మరియు ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ గారి సూచనల మేరకు పర్యటించారు. జనసేన పార్టీ తరఫున వారికి భోజనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్ల ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు ఆకుపాటి ఉష,షేక్ సుభాని,3వ డివిజన్ అధ్యక్షులు షేక్ ముంతాజ్ మరియు జనసేన పసుపులేటి శ్రీహరి, నరసింహారావు,చెన్ను నరేష్,రాజేంద్ర,డేవిడ్ రాజు, సోను తదితరులు పాల్గొన్నారు.