Search
Close this search box.
Search
Close this search box.

రైల్వే కోడూరులో జనసేనాని జన్మదిన సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు

          రైల్వే కోడూరు ( జనస్వరం ) : రైల్వే కోడూరు జనసేన పార్టీ దళిత నాయుకులు నగిరిపాటి.మహేష్ గారి ఆధ్వర్యం లో జనసేనాని పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వేడుకలలో భాగంగా మెగా రక్త దాన కార్యక్రమం చెప్పట్టడం జరిగినది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మాకు దైవ సమానులైన అవినీతి మచ్చ లేని నాయుకుడు, అకుంటి దీక్షపరుడు,అపర భగీరథుడు, ఆంధ్ర ప్రజల ఆశా జ్యోతి ముఖ్యంగా మనసున్న మా మహారాజు శ్రీ కోనేదేల పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన రోజు శుభాాంక్షలు తెలియు జేస్తున్నాం. ఎంతో మంది అభాగ్యులకు అత్యవసర పరిస్థితుల్లో రక్తం అందక ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు అనేకం చూస్తున్నాం ,మా నయుకుడు పుట్టినరోజు సంద్భంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలనే దృక్పథంతో మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన ప్రాణదాతలకు శిరస్సు వంచి ధన్యవాదాలు తెలుపుతున్నాన్నట్లు వెల్లడించారు. రక్త దాతలు బెడ్ పైనుంచి ప్రతి ఒక్కరూ పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ, ఈ అవకాశాన్ని కల్పించిన మహేష్ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఆనంద బాష్పాలతో కళ్ళు చమగలడం విశేషం.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర కార్యదర్శి అయిన తాతంశెట్టి నాగేంద్ర గారు , నాయుకులు ఉత్తరాది శివకుమార్, అంకి శెట్టి మనీ, మర్రి రెడ్డి ప్రసాద్, గంధం శెట్టి దినకర బాబు, ముత్యాల కిషోర్, మనీ, సాయం శ్రీధర్, ఆలం రమేష్ మరియు పవన్ సాయి, వైజయంతి గారు, ముఖ్య పార్టీ నాయకులు, పవన్ కళ్యాణ్ గారి అత్యంత ఇష్టమైన జనసైనికులు వీర మహిళలు పాల్గొని విజయవంతం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way