క్రిస్మస్ పర్వదినాన పేద ప్రజలకు దుప్పట్లు పండ్లు పంపిణీ చేసిన గుడివాడ పట్టణ జనసైనికులు

క్రిస్మస్

         కృష్ణా ( జనస్వరం ) : గుడివాడ పట్ట స్థానిక తట్టివర్రు రోడ్లో నివాసం ఉంటున్న పేద ప్రజల మధ్యలో క్రిస్మస్ కేకు కట్ చేసి దుప్పట్లు మరియు స్వీట్ బాక్స్లు అందజేసిన గుడివాడ పట్టణ జనసైనికులు.  ఈ సందర్భంగా గుడివాడ పట్టణ జనసేన నాయకులు మాచర్ల రామకృష్ణ (Rk) మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో మానవసేవయే మాధవసేవ అనే నినాదంతో క్రిస్మస్ వేడుకలు అందరూ చేసుకోవాలని ఆలోచనతో ఊరు చివర ఉన్న పేద ప్రజల మధ్యలో కుల మతాల అతీతంగా క్రిస్మస్ సంబరాలు చేసుకోవడం జరిగింది. శాంతి, కరుణను ప్రపంచానికి ప్రబోధించిన మహానీయుడు ఏసుక్రీస్తు ప్రస్తుత విపత్కర పరిస్థితుల నుండి మానవాళిని రక్షించాలని ప్రార్థిస్తూ క్రైస్తవ సోదర, సోదరీమణులందరికీ క్రిస్మస్ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు. షేక్ మీరా షరీఫ్ గారు,అయ్యప్ప, శాయన నాని గారు, పవన్ గారు, చరణ్, నాగ సాయి, వీర మహిళలు మేరీషా, కీర్తి, హాసిని, సాయి, మరియు జన సైనికులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way