
అరకు, (జనస్వరం) : విశాఖ జిల్లా, అరకు నియోజకవర్గం, అనంతగిరి మండలం మారుమూల గ్రామాలైన, బారజోలలో తారురోడ్డు పనులు పూర్తి చేయాలని, జనసేన నాయకుడు సాయిబాబా అధ్వర్యంలో శనివారం నాడు, ఆయా గ్రామంలో పర్యటించి, ముందుగా గిరిజనులతో సమావేశమై చర్చించారు. ముఖ్యంగా ఆయా గ్రామంలో రోడ్డు సదుపాయాలు అందుబాటులో లేకా అభివృద్ధికి అమడ దూరంలో అక్కడ గిరిజనులు వున్నారని తెలిపారు. తారు రోడ్డు మంజూరు చేసి నేటికి మూడు సంవత్సరాలు అయినా, గుత్తేదారు రోడ్డు పనులు ప్రారంభించి మధ్యలో నిలిపివేశారు. రోడ్డు పనులోకూడ నాణ్యత లేదు. ఇది వరకు పనులు చేపట్టిన కల్వర్తోలో కూడ నాణ్యతలేని పనులు చేసి వున్నారని తెలిపారు.ఈ సందర్భంగా సాయిబాబా మాట్లాడుతూ, ప్రభుత్వ సంబంధిత అధికారులు తక్షణం ఈ బారజోల రోడ్డుపై దృష్టి పెట్టాలని, నాణ్యతలేని రోడ్డు, కల్వర్ట్టు పనులు చేయించిన గుత్తేదారుడుపై చర్యతీసుకోవాలని, ప్రభుత్వానికి డిమాండు చేశారు. అనంతరం దీనికై నిరసనగా గిరిజనులతో పాటు కిలోమీటర్ల దూరంవరకు, ప్రభుత్వానికి నిరసన రూపంలో జనసేన నాయకుడు సాయిబాబా అధ్వర్యంలో చేసారు.ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, జనసైనికులు దాసు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.