ఓ మహాప్రభో రోడ్లేయండి : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

దారం అనిత

            మదనపల్లి ( జనస్వరం ) : ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లా నుండి చిత్తూరు జిల్లా వరకు ఏ జిల్లాలో చూసిన రోడ్లు అత్యంత ప్రమాదకరంగా భయానకంగా మారాయని చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత పత్రికాముఖంగా తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ  పల్లెల్లోని రహదారుల్లో ప్రయాణం ప్రాణాల మీదకు వస్తోంది. కొన్నేళ్లుగా కనీస నిర్వహణ లేక మరమ్మతులకు నోచుకోక పోవడంతో రోడ్లన్నీ అత్యంత ప్రమాదకరంగా మారాయి. వర్షం పడితే పరిస్థితి మరీ దారుణమని అన్నారు. పల్లెల నుండి వ్యవసాయ ఉత్పత్తుల్ని తరలించాలన్న సాగుకు అవసరమైన ఎరువులు వంటివి తెచ్చుకోవాలన్న, ఈ అద్వానపు రోడ్ల మూలంగా ఖర్చు తడిసి మోపెడు అవుతుంది. ఒక పల్లె కాదు ఒక ఊరు కాదు, ఎక్కడ చూసినా ఇదే దుస్థితి ఏర్పడిందన్నారు. ఉపాధి హామీ పథకం మెటీరియల్ కాంపోనెంట్ నిధుల్ని రాష్ట్రప్రభుత్వం మూడేళ్లుగా రహదారులకు నామమాత్రంగా ఇస్తూ అధికశాతం నిధులు భవనాల నిర్మాణానికి కేటాయించడంతో గ్రామాలలో కనీస మరమ్మతులకు కూడా నోచుకో వట్లేదు. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ లతో చేపట్టిన రహదారుల పనులు గుత్తేదారులకు బిల్లులు చెల్లించక నిలిచిపోయాయి. 26 జిల్లాలు పరిశీలిస్తే రోడ్ల పొడవు 166 కిలో మీటర్లు ఉండగా కనిపించిన గుంతలు 6220 సగటున ఒక కిలో మీటర్ కి 37 గుంతలు కనిపిస్తున్నాయి. రోడ్ల పరిస్థితి ఇలా ఉండటం వల్ల కొన్ని ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నిలిపివేశారు. ద్విచక్ర వాహనాల్లో పైనుండి పడి ఎవరో ఒకరు పడి గాయాల పాలవుతున్నారు. 

           గత సీజన్లో వర్షాకాలం వచ్చేసిందని ఇప్పుడు రోడ్లు బాగు చేయలేని ప్రభుత్వం చెబుతూ వచ్చింది వర్షాలు తగ్గాక పనులు చేస్తామని తర్వాత పట్టించుకోలేదు. ఇటీవలే పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖపై ముఖ్యమంత్రి సమీక్షించి నప్పుడు గ్రామీణ రహదారులు వెయ్యి కోట్లు కోట్లు అవసరమని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. టెండర్లు పిలిచి పాడైన రహదారులు బాగు చేయాలని సీఎం ఆదేశించారు. ఎప్పుడూ టెండర్లు పిలవాలి, ఎప్పుడు పనులు చేయాలి. నెలరోజులు ఆగితే మళ్లీ వర్షాకాలం మొదలవుతుంది. అప్పుడు మళ్ళీ వర్షాలు వచ్చేశాయ్ అని అధికారులు వాయిదా వేస్తారమో అని జోస్యం చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని రహదారులు వేయాలని డిమాండ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way