పెద్దపల్లి జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు కొరకు సూచనలు : బండారు శ్రీనివాస్

పెద్దపల్లి జనసేన కార్యకర్తలకు క్రియాశీలక సభ్యత్వం నమోదు కొరకు సూచనలు : బండారు శ్రీనివాస్

                   ఆలమూరు మండలంలోని, పెద్దపళ్ళ గ్రామంలో, కళ్యాణ మండపము నందు కొత్తపేట నియోజకవర్గ ఇంచార్జ్ జనసైనికులు, బండారు శ్రీనివాస్ అధ్యక్షతన వారి ఆధ్వర్యంలో ముఖ్య జనసైనికులకు, కార్యకర్తలకు, భీమాపథకం కొరకు క్రియాశీలసభ్యత్వం నమోదు కొరకు, పలుసూచనలు, సలహాలు ఇస్తూ, జనసేన పార్టీ యొక్క విలువలను, సిద్ధాంతాలను, ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని చెప్పారు. జనసేన పార్టీలో ఉండే ప్రతి కార్యకర్తకు, ఆరోగ్య భీమా తప్పనిసరిగా ఉండాలని కోరారు. అది కుటుంబ సభ్యులకు రక్షణ కోసం ఉపయోగపడుతుందని, క్రియాశీలక సభ్యులకు ఇన్సూరెన్స్ కల్పించిన పవన్ కళ్యాణ్ కు ధన్యవాదాలు తెలిపారు. ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే ఐదు లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ పథకం వర్తిస్తుందని, అదే విధంగా గాయపడితే 50 వేల రూపాయల ఆర్థిక సహాయం కల్పించే విధంగా ఈ బీమా సౌకర్యం అండగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యత్వము 500 రూపాయలు చెల్లించి తీసుకోవాలని కోరారు. బండారు శ్రీనివాస్ సూచిస్తూ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అందరూ నమోదు చేయించుకోవాలని కోరారు. ఇలాంటి పథకము ఏ పార్టీలోనూ లేదని, ఏ నాయకుడూ ఇంతవరకూ కార్యకర్తల గురించి ఇలాంటి ఆలోచన చేయలేదని, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, కార్యకర్తలను గుండెల్లో పెట్టుకుని చూసే నాయకుడిని, బండారు శ్రీనివాస్ కొనియాడారు.