Search
Close this search box.
Search
Close this search box.

బుద్ధి మందం వెధవలకి ఎంత చెప్పినా అర్థం కాదు : గునుకుల కిషోర్

గునుకుల కిషోర్

             నెల్లూరు ( జనస్వరం ) : బుద్ధి మందం వెధవలకి ఎంత చెప్పినా అర్థం కాదు అని మా చిన్నప్పుడు మాస్టారు నేర్పించారని,   అప్పుడు అర్థం కాలేదు కానీ ఇప్పుడు వైసీపీ నాయకులను చూస్తే అర్థమవుతుందని నెల్లూరు జిల్లా జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ అన్నారు. ఆయన మాట్లాడుతూ పార్టీని తన కష్టార్జితంతో నడుపుతున్నానని నా సంపాదన ఇది నా ఖర్చు ఇది అని పారదర్శకంగా బహిర్గతంగా ప్రకటించినప్పటికీ గ్రహచారం బాగా లేక మూడు పెళ్లిళ్లు చేసుకోవాల్సి వచ్చింది అని స్పష్టంగా తెలిపినా…. మొదటి మూడు పెళ్లిళ్లు ముద్దు రాజధానిలో వద్దు అని జగన్ రెడ్డి గారు వక్రీకరించిన జగన్ రెడ్డి గారు సిగ్గుపడాలన్నారు. జిల్లా విషయానికొస్తే మా అధ్యక్షులు మనుక్రాంత్ గారు చెప్పినట్టు ఎక్కడ చూసినా రౌడీయిజం మానభంగాలు మాఫియా గంజాయి కేసులతో క్రైమ్ క్యాపిటల్ గా మారిన మారింది దీనికి మా ఎమ్మెల్యే అనీలు ఏం చేస్తున్నారన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించడంలో విఫలమైందని రైతులు కన్నీరుకు సమాధానం చెప్పలేక పోయిన కాకాణీ పౌరసరఫరాల శాఖలో రైతులకు అందాల్సిన డబ్బులు దుర్వినియోగం గురించి ఏమి చేయలేరు. భూదందాలు రియల్ ఎస్టేట్ లో తలమునకలైన ప్రసన్నకుమార్రెడ్డి రాజకీయానికి అనర్హుడని అన్నారు. ముందుగా ఎలక్షన్లకు వెళతామని మీరు జరిపిన సర్వేల సాక్షిగా ప్రజలు మిమ్మల్ని ఛీ కొడుతున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో అధ్యక్షులు చెన్నారెడ్డి మనుక్రాంత్ గారి ఆధ్వర్యంలో ప్రజలకు జనసేన ప్రత్యామ్నాయం కానున్నారు, జనసేన జెండా ఎగర వేస్తామని అన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way