విశాఖ పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డులో జనసేన పార్టీలోకి నూతన చేరికలు

విశాఖ

    విశాఖపట్నం  (జనస్వరం) : విశాఖ పశ్చిమ నియోజకవర్గం 91వ వార్డు పాత గోపాలపట్నంలో  జనసేన పార్టీ పశ్చిమ నాయకులు శ్రీ పెతకం శెట్టి శ్యామ్ సుధాకర్ గారు పార్టీ జెండా ఎగురవేసి, పార్టీ బలోపేతానికి నాంది పలికారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ యువకులు, మహిళలు పార్టీ కండువా వేసుకొని పార్టీలో చేరడం జరిగింది. వారు మాట్లాడుతూ నియోజకవర్గములో జనసేన పార్టీ బలోపేతమే ధ్యేయంగా, జనసేన శ్రేణులను ఉత్తేజపరుస్తూ జనసైనికులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, కార్యకర్తలు ఎవరు అధైర్యపడవద్దంటూ జనసైనికులకు భరోసానిస్తూ భవిష్యత్తులో పార్టీ బలోపేతానికి అందరూ కలసి ఏకతాటిపైకి వచ్చి కృషిచేయాలని కార్యకర్తలకు నిర్ధేశించారు. అలాగే వార్డులో పలు సమస్యలకు పరిష్కారం కొరకు పోరాటం చేసేందుకు పార్టీ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way