Search
Close this search box.
Search
Close this search box.

గుంటూరు జనసేనపార్టీలో నూతన చేరికలు

గుంటూరు

   గుంటూరు ( జనస్వరం ) : గుంటూరు జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు గారి సమక్షంలో గుంటూరు కార్పోరేషన్ 12వ వార్డ్ లాలాపేట్ నుంచి యువత పార్టీలో చేరడం జరిగింది. వీరిని పార్టీ జెండా మెడలో వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. గతంలో వీరు వైసిపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేసిన వారు. వీరికి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరడం జరిగిందని అన్నారు. గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేన పార్టీ సిద్దాంతాల కోసం, పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం కృషి చేయాలని కోరారు. అనిల్  ఆధ్వర్యంలో నూతనంగా పార్టీలోకి  సమీర్, బాజీ, హఫీజ్, సుభాని, పవన్ కుమార్, స్వరాజ్, పుష్పరాజ్, వంశీ, ఆర్య, చందు, హరి, అమర్నాథ్, సంతోష్, ప్రేమ్ కుమార్, జనార్ధన్, సత్య, చంద్రశేఖర్, సాయి, శాంతిరాజ్, రామకృష్ణ తదితరులు చేరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు అడపా మాణిక్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి నారదాసు రామచంద్ర ప్రసాద్, శిఖాబాలు, సతీష్, మదులాల్, నెల్లూరి రాజేష్, తన్నీరు గంగరాజు, అన్నే.వెంకటేశ్వరరావు, మహంకాళి  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way