-టిడిపి నిర్మాణ వైఫల్యం
– వైసీపీ నిర్వహణ వైఫల్యమే
– ఎప్పడూ సినిమా టికెట్ల పై కాక నగర వాసులకు ఉచితంగా ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేదుకు పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయాలి.
– జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి 4గునుకుల కిషోర్
నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు నగరంలో నెక్లెస్ రోడ్డు ను జనసైనికులతో కలసి జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 కోట్ల రూపాయల వ్యయంతో నెల్లూరుకి ప్రతిష్టాత్మకంగా సందర్శన ప్రాంతంగా మార్చాలని నిర్మించిన నెక్లెస్ రోడ్డు నిరుపయోగంగా ఉంది. పూర్తిగా నిర్మాణ లోపంతో మెయింటినెన్స్ లేక అసాంఘిక కార్యకలాపాలకు నెలవుగా మారింది. గుత్తేదారుల స్వార్థంతో పూర్తిగా లోప భూయిష్టంగా నిర్మితమైన ఈ నెక్లెస్ రోడ్డు ఎవరికి ఉపయోగపడకుండా ఉంది. రోడ్ల అంతా పగుళ్ళు కింద చెరువు కోట గురై రోడ్ల పరిస్థితి ఏర్పడుతుంది ప్రజాధనంతో నిర్మించిన ఆస్తులను, గత టీడీపీ హయాంలో ఎన్నికల సమయంలో హడావుడిగా చేపట్టిన నిర్మాణాలు పూర్తవకుండానే ప్రభుత్వం మారిపోవడంతో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జరిగిన నిర్మాణాలను పూర్తి చేయకుండా వదిలేసిందని కిషోర్ ధ్వజమెత్తారు. కాపాడాల్సిన కార్పొరేషన్ అధికారులు నెల్లూరు నగర మునిసిపల్ నాయకులు చోద్యం చూస్తున్నారు. ఇలా ఒకటి కాదు నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రజాధనంతో నిర్మించబడిన సగం ఆస్తులు నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు. కొత్తవాటిని ప్రారంభించేముందు నిధులు సరిగా సరిచూసుకొని ఉన్న వాటిని పూర్తి చేస్తే బాగుంటుందని జనసేనపార్టీ ద్వారా తెలియజేస్తున్నామని అన్నారు. దీని దగ్గర పెద్ద చెరువు ఉంది ట్యాంక్బండ్ ఉంది దీనిని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి పరిస్థితి పూర్తిగా ఉచితంగా నగర ప్రజలకు వినోదాన్ని అందించిన వారవుతారు. దీన్ని మర్చిపోయి ఇప్పుడు సినిమాలపై పడి అధికార పార్టీ నాయకులు ఏడుస్తున్నారు.వైసీపీ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసి సినిమా పరిశ్రమపై పగతీర్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. నెల్లూరు నగరంలోని కాపు భవనం, రాజీవ్ గృహకల్ప భవనాలు 80 శాతం పనులు పూర్తయిందని, మిగిలిన పనులు కూడా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. వైసీపీ టీడీపీ ప్రభుత్వాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ అరాచకాలకు పాల్పడుతున్నారు అని ఆయన మండిపడ్డారు. రూ.25 కోట్లతో నిర్మించిన నెక్లెస్ రోడ్డు పూర్తిగా దెబ్బతిని పగుళ్లు ఏర్పడి శిథిలావస్థకు చేరిందని ఆయన తెలిపారు.
