Search
Close this search box.
Search
Close this search box.

నల్లాని రాజేశ్వరి నిర్మించిన పాటల సిడిని ఆవిష్కరించిన నారా లోకేష్

       మంగళగిరి, మార్చి 22 (జనస్వరం) : మూడు దశాబ్దాల ముందుచూపుగల విజనరీనేత చంద్రబాబు విశ్వం మెచ్చిన నాయకుడని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్ అన్నారు. ప్రముఖ సామాజిక కార్యకర్త, కాలమిస్ట్ నల్లాని రాజేశ్వరి నిర్మించిన పాట వీడియో సిడిని శుక్రవారం మంగళగిరిలో ఆయన ఆవిష్కరించారు. చంద్రబాబు ఔన్నత్యంపై అద్భుతగీతం రూపొందించారని ప్రశంసించారు. ఈ సందర్భంగా పాటలోని సంగీతం, సాహిత్యం అందరినీ ఆకట్టుకుంది. చంద్రబాబు నాయుడి స్ఫూర్తివంతమైన నాయకత్వం, ఆదర్శ వ్యక్తిత్వం గురించి తనదైన ఆలోచనతో నిర్మాత నల్లాని రాజేశ్వరి విసిడి రూపొందించారు. ప్రముఖ కవి, కళారత్న బిక్కి కృష్ణ రాసిన గీతానికి సినీ సంగీతదర్శకులు చిన్ని కృష్ణ చక్కని బాణీలను సమకూర్చారు. ఆకట్టుకునే సంగీతం, చైతన్యవంతమైన గానం, అర్థవంతమైన సాహిత్యంతో పాట అందరి హృదయాల్లోకి దూసుకెళ్లి బహుళప్రచారం పొందుతుందని నిర్మాత రాజేశ్వరి ఆశాభావం వ్యక్తంచేశారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై ఫౌండేషన్ సిఇఓ గుత్తా హరిసర్వోత్తమ నాయుడు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way