సొంత నిధులతో కాలువ పూడికతీతకు శ్రీకారం చుట్టిన నలిశెట్టి శ్రీధర్

నలిశెట్టి శ్రీధర్

       ఆత్మకూరు ( జనస్వరం ) : జనసేనాని పవన్ కళ్యాణ్ గారి బాటలోనే, ఆత్మకూరు నియోజకవర్గ ఇంచార్జ్ నలిశెట్టి శ్రీధర్, సంగం మండలం, అనసూయ నగర్ లో తన సొంత నిధులతో కాలవకు పూడిక తీతకు శ్రీకారం చుట్టారు. వివరాల్లోకి వెళితే సంఘం మండలం అనసూయ నగర్ లో ఇళ్ల మధ్యన మురికి నీరు చేరి దుర్గంధ భరితంగా మరియు దోమల ఆవాస కేంద్రంగా తయారై ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ సమస్యను పరిష్కరించమని స్థానిక జనసేన నాయకులతో కలిసి నియోజకవర్గ ఇన్చార్జ్ నలిశెట్టి శ్రీధర్ స్థానిక ఎంపీడీవో గారి నుంచి జిల్లా కలెక్టర్ గారి వరకు అనేక వినతి పత్రములు ఇచ్చినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈరోజు దీనిపై స్పందించిన శ్రీధర్ తన సొంత నిధులతో ఈ కాలువ పూడికతీతకు శ్రీకారం చుట్టి ఈ సమస్యను పరిష్కరించడం జరిగింది.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్చార్జ్ నలిసిటీ శ్రీధర్ తో కలిసి స్థానిక నాయకులు అట్టిపాటి కృష్ణ మోహన్, సీనయ్య, వెంకటేశ్వర్లు,రామకృష్ణ, నరసయ్య,సీనయ్య,భాస్కర్, సీను, సుబ్బయ్య,వెంకటేష్, రవి,ఆనందరా వు తదితరులు పాల్గొనడం జరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way