గోమాత పట్ల మానవత్వం చాటుకున్న రైల్వే కోడూరు జనసైనికుడు నగిరిపాటి మహేష్‌

గోమాత పట్ల మానవత్వం చాటుకున్న రైల్వే కోడూరు జనసైనికుడు నగిరిపాటి మహేష్‌ 

                రైల్వేకోడూరు పట్టణ ప్రాంతంలో రాత్రి గోమాతలు ప్రధాన రహదారిలో సంచరిస్తూ కనిపిస్తుంటాయి. ఇదే. తరుణంలో రైల్వే కోడూరుకి బైపాస్‌ రోడ్డు లేకపోవడంతో భారీ వాహనాలు టౌన్‌ లో నుంచి వెళ్తూ ఉంటాయి. ఈ తరుణంలో గత రాత్రి 11 గంటలకు అటుగా వెళ్తున్న జనసైనికుడు నగిరిపాటి మహేష్‌ గుర్తుతెలియని వాహనం గోమాత కాలిపై తొక్కించుకొని వెళ్లడంతో, స్వతహాగా మెడికల్‌ ప్రాక్టీషనర్‌ అయిన నగిరిపాటి మహేష్‌ ఈసంఘటన చూసి చలించిపోయి. వెంటనే ప్రథమ చికిత్స చేసి గోమాతను రక్షించడం జరిగింది. ఈ విషయంపై మహేష్‌ మాట్లాడుతూఇలా ప్రతి రోజు ఎన్ని సంఘటనలు జరుగుతున్నయో తెలియడం లేదని, ఎన్ని మూగజీవాలు ఇలా బలి అవుతున్నాయో తెలియడం లేదని ఇలా చిన్నచిన్న గాయాలు అయితే పశువుల ఆసుపత్రిలో పోలేక పురుగులు పట్టి వాటి మరణానికి దారితీస్తాయని, ఇప్పటికైనా గోమాత యజమానులు స్పందించి వారి ఇంటి వద్దనే పెట్టుకునే విధంగా చర్యలు తీసుకుంటే మనం గోమాతలను రక్షించిన వారమవుతామని ఆవేదన వ్యక్తం చేశాడు. రోడు ‘పైన సంచరిస్తూ, రోడ మీద స్వేద తీరడం వలన వాహనాల బారిన గాయాల పాలు అవుతున్నాయి. ఎన్నో మూగజీవాలు ఏక్సిడెంట్‌ లో ప్రాణాలు కోల్పోతున్నాయి. ఇలా నా కంట ఒక గోమాత బిడ్డ నడవ లేని స్ధితి లో కనిపించింది. వెంటనే వైద్యం చేసి డ్రెస్సింగ్‌ లేసి కట్టు కట్టడం జరిగింది. ఇలా జరగటం ఇది తొలిసారి కాదు. ఇలా అనేక పర్యాయాలు ఏక్సిడెంట్‌ బారిన పడి, గాయాల పాలు కావడం గమనర్హం. వీటిని పట్టించుకునే నాథుడే లేడు. ఈ పట్టణంలో సుమారు 50 గోవులు మందలు మందలుగా రోడ్లపై సంచరిస్తూ, మేత దొరక్క కాగితాలు, ప్లాస్టిక్‌ కవర్లు ఇంకా అనేక ఇతర వేస్ట్‌ పదార్థాలను తినటం వలన అనేక అనారోగ్య సమస్యల రావడం చనిపోవడం జరుగుతున్నాయి. వాహన దారులకి కూడా రవాణా కి ఆటంకం  కలుగుతున్నది.  వెంటనే ఇలాంటి వాటిని స్థానిక పశువుల ఆసుపత్రి పరిధిలోకి తెచ్చి వాటి పోషణ, వైద్యం అందించేందుకు ప్రభుత్వం అధికారులు చొరవ చూపాలని  రైల్వే కోడూరు  జనసేన పార్టీ తరఫున డిమాండ్స్‌ చేశారు.