Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ బాటలో మైలవరం జనసేన నాయకులు

       ఇబ్రహీంపట్నం, (జనస్వరం) : పవిత్ర సంగమం వద్ద మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని జనసేన నాయకులు భక్తులకు అల్పాహారం, చిన్న పిల్లలకు వృద్దులకు కాఫి, పాలు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. సంగమం వద్ద జనసేన నాయకులు ఏర్పాటు చేసిన ఈ శిబిరంలో భారీగా భక్తులు పాల్గొని అల్పాహారన్ని స్వీకరించారు. మహాశివరాత్రి రోజున ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేయడం ద్వారా పార్టీని ప్రజలలోకి తీసుకు వెళ్లాలని, పార్టీ అధ్యక్షుని బాటలో ప్రజలకు సేవ చేయడం చాలా సంతోషంగా ఉందని జనసైనికులు తెలియజేసారు. ఉదయాన్నే పవిత్ర స్నానం ఆచరించడానికి వచ్చిన భక్తుల సౌకర్యార్థం ఇలాంటి కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజున ఏర్పాటు చేయడం చాలా ఆనందంగా ఉందని నిర్వాహకులు బత్తిన శ్రీనివాసరావు తెలియజేసారు. ఈ కార్యక్రమంలో మైలవరం నియోజకవర్గ ఇంచార్జ్ అక్కల రామ్మోహన్ రావు పాల్గొని భక్తులకు సేవచేయడం చాలా ఆనందంగా ఉందని ఉదయం నుండి సుమారు 15000 మందికి అల్పాహారం అందించామని, పవన్ కళ్యాణ్ స్పూర్తితో ఇలాంటి సేవా కార్యక్రమాలలో జన సైనికులు ముందు ఉంటారని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కొండపల్లి మున్సిపల్ జనసేన నాయకులు చెరుకుమల్లి సురేష్, దేవబత్తుల నాగబాబు, సామల సుజాత, సిరిపురం సురేష్,చిట్టెలు కోటేశ్వరరావు, ఎస్.శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way