Search
Close this search box.
Search
Close this search box.

హైదరాబాదులో MyFirstVoteToJanaSena కార్యక్రమం

హైదరాబాదు

     హైదరాబాదు ( జనస్వరం ) : హైదరాబాద్ సిటీ కళాశాల జనసేన విద్యార్థి విభాగం విద్యార్థి నాయకులు తమ మొదటి ఓటు జనసేన గాజు గ్లాసుకే వేస్తాం అని వెల్లడించారు. విద్యార్థుల కోసం జనసేన విద్యార్థి విభాగం పని చేస్తుందని భవిష్యత్తులో జనసేన విద్యార్థి విభాగం మరింత బలంగా ముందుకు వెళ్తుందని అన్నారు. కళాశాలలో చాలా మరమ్మతులు చేయాలని వాటిపై త్వరలో ఒక నివేదిక కూడా సమర్పిస్తామని ఆవిరేను వెంకటేష్ నేత (AVN) చెప్పారు. విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్ లను ప్రతి ఏటా ఆలస్యం చేస్తున్నారు అని తమకి ఇతర రాజకీయ పార్టీల పై నమ్మకం లేదని పవన్ కళ్యాణ్  పై అభిమానం మాత్రమే కాదు నమ్మకం కూడా ఉందని అన్నారు. తెలంగాణలో జనసేన ఎక్కడ నుండి పోటీ చేసిన విద్యార్థుల ఓట్లు అత్యధికంగా పడేటట్టు చేస్తామని AVN అన్నారు. ఈ ఎన్నికలు ఫలితాలు తారుమారు చేసే సత్తా యువతకి మాత్రమే ఉందని ఏవిఎన్ చెప్పారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు గోగులోత్ ధనుష్, మణికంఠ, ఆదిత్య యాదవ్, సూర్యకాంత్ నాయక్, ఆవిరేను వెంకటేష్ నేత, మరి కొద్దీమంది విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way