ముద్రగడ పద్మనాభం చేసిన అవగాహన లేని వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా

ముద్రగడ

      కాకినాడ ( జనస్వరం ) : ద్వారంపూడి చంద్రశేఖర్ ‘రెడ్డి’ మీద విమర్శలు చేస్తే పవన్ కళ్యాణ్ గారిని వీధి రౌడీలా మాట్లాడుతున్నావని ఉద్భోదించిన ముద్రగడ పద్మనాభం, ఇదే రెడ్డి పవన్ కళ్యాణ్ గారిని నోటికొచ్చినట్లు బూతులు తిట్టినప్పుడు ఏం చేస్తున్నారని అనుపాలెం జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు తోట లక్ష్మీనారాయణ ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం వచ్చిన 4 సంవత్సరాలనుండి నాజాతి నాజాతి అని అనునిత్యం అనే మీరు కాపు కార్పొరేషన్ ద్వారా నేటి వైసీపీ ప్రభుత్వం ఇస్తానన్న సంవత్సరానికి పది వేలకోట్ల రూపాయల ప్రత్యేక నిధులగురించి మీరు ఎందుకు పోరాడలేదు. ఇప్పుడు ఇప్పటివరకు ఏ దొడ్లో ఉన్నావు ఏ సావిట్లో గడ్డి తింటున్నారు పక్కింట్లో గడ్డ పెరుగు కోసం ఇంటివారిని నిందించే ముద్రగడ సారు ఒకసారి ఆలోచించండి. ఇది అమాయక పాతతరం కాదు తరాతరాలుగా అణచివేతకు గురి అవుతూ ఉన్న కాపు సామజిక వర్గంలో అత్యధికంగా ఉన్న సామాన్య మధ్యతరగతి ప్రజలను అనేక కారణాలతో విచ్చిన్నం చేస్తూ మీలాంటి కొంత మంది వ్యక్తిగత ప్రయోజనాలకోసం వాడుకుని మీలాంటి వారు చేస్తున్న కుటిల రాజకీయ క్రీడాలో నష్టపోతూనె ఉన్నారు. నేటి యువత విద్యావంతులుగా మారుతూ ఆలోచన, పరివార్తన కలిగిన “చైతన్య నవతరం” నేటి పరిస్థితులను గమనిస్తూ అవగాహనతో ఉన్నది మీలాంటి సంఘ ఉద్దారకులుగా ఉంటూ స్వప్రయోజనాల పరమావదిగా నాటకాలు ఆడే మీలాంటి కపటి ప్రేమికుల కాలం చెల్లింది మీ లాంటి వారికి ఖచ్చితంగా బుద్ది చెప్తామన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way