GVMC లో జనసేన ఫ్లోర్‌ లీడర్‌ గా శ్రీమతి వసంత లక్ష్మి – డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గా శ్రీ దల్లి గోవింద రెడ్డి గారిని నియమించిన జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

     విశాఖపట్నం, (జనస్వరం) : విశాఖపట్నం మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) కౌన్సిల్‌ లో జనసేన ఫ్లోర్‌ లీడర్‌ గా శ్రీమతి భీశెట్టి వసంతలక్ష్మి, డిప్యూటీ ఫ్లోర్‌ లీడర్‌ గా శ్రీ దల్లి గోవింద రెడ్డిలను పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు నియమించారు. మున్సిపల్‌ కార్పొరేషన్ల కౌన్సిల్‌ లో జనసేన పార్టీ నుంచి నియామకం జరుగుతున్న తొలి పదవులు ఇవే. జనసేనపార్టీలో వీర మహిళలకు పార్టీ అధ్యక్షులు ఎనలేని ప్రాధాన్యాన్ని ఇస్తున్న సంగతి విదితమే. పార్టీ కమిటీలలో కూడా వారికి సముచిత స్థానాన్ని కల్పిస్తున్నారు. 33 శాతం పదవులలో వీర మహిళలను నియమించాలని కూడా నిర్దేశించారు. మహిళా సాధికారతను గౌరవిస్తూ పోరాటపటిమ కలిగిన వీర మహిళ శ్రీమతి వసంత లక్షిని జనసేన ప్లోర్‌ లీడర్‌ గా ఎంపిక చేశారు. జనసేన పార్టీపై గంగపుత్రులు అవిభాజ్యమైన ప్రేమానురాగాలను చూపుతుంటారు. గంగవరంలో గంగపుత్రులు అధికంగా ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతమంతా మత్య్యకారులే నివసిస్తుంటారు. కార్పొరేషన్‌ ఎన్నికలలో వారు జనసేన అభ్యర్థిని గెలిపించుకున్నారు. అందుకు కృతజ్ఞతాపూర్వకంగా గంగవరం డివిజన్‌ నుంచి ఎన్నికైన శ్రీ దల్లి గోవింద రెడ్డిని డిప్యూటీ ప్లోర్‌ లీడర్‌ గా ఎంపిక చేశారు. మత్స్యకారుల పట్ల తనకున్న అభిమానాన్ని శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు ప్రకటించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి అకుంఠిత దీక్షతో శ్రీమతి వసంత లక్ష్మి, శ్రీ గోవిందరెడ్డి కృషి చేస్తారని విశాఖ నగర వాసులకు తెలియచేస్తూ వారిరువురికి శ్రీ పవన్‌ కళ్యాణ్‌ గారు శుభాశీస్సులు అందచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way