బదిలీపై వెళ్తున్న అనంత జిల్లా ఎస్పీని సన్మానించిన MRPS రాష్ట్ర కమీటీ అధ్యక్షులు బి.సి.ఆర్ దాస్

బి.సి.ఆర్ దాస్

                           అనంతపురం జిల్లాకు విస్కృతమైన సేవలు అందించిన ఎస్పీ శ్రీ సత్య యేసు బాబు గారు బదిలీపై వెళ్తున్న విషయం తెలిసిందే. MRPS రాష్ట్ర కమీటీ అధ్యక్షులు బి.సి.ఆర్ దాస్ గారు మరియు కమీటీ మెంబర్స్ కలసి ఎస్పీ ఆఫీసులో సత్య యేసు బాబు గారిని కలసి ఘనంగా సన్మానించారు. బి.సి.ఆర్ దాస్ గారు మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు సత్య యేసు బాబు గారు విస్కృతమైన సేవలు అందించారని కొనియాడారు. అలాగే నిరంతరంగా స్పందన కార్యక్రమం నిర్వహిస్తూ సామాన్య ప్రజల్లో సైతం మనసు సంపాదించారని, ప్రజల సమస్యలను సైతం తొందరగా పరిష్కరించేవారని అన్నారు. యేసు బాబు గారు జిల్లాకు ఎస్పీ గా బాధ్యతలు చేపట్టాక జిల్లాలో నాటుసారా, రౌడీయిజం తగ్గిందని అన్నారు. నిరంతరం ఫ్యాక్షనిజాన్ని రూపుమాపడానికి ప్రయత్నించేవారని అన్నారు. ఇలాగే సామాన్య ప్రజల సమస్యలు తీరుస్తూ మరింత ఉన్నతమైన స్థానానికి ఎదగాలని కోరారు. ఎస్పీ సత్య యేసు బాబు గారు మాట్లాడుతూ బి.సి.ఆర్ దాస్ గారు అణగారిన వర్గాల కోసం నిరంతరం పోరాడటం నేను కళ్ళారా చూశానని, ఏవైనా సమస్యలు వస్తే అధికారుల దృష్టికి తీసుకురావడం, పరిష్కారం అయ్యే దిశగా పోరాడేవారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో చిల్ల వారి పల్లి శివయ్య, కురుగుంట ఓబులపతి, రామకృష్ణ, రాము, నాగభూషణ్,  చెన్నప్ప, సుబ్రమణ్యం, నాగేంద్ర, ఆంజనేయులు, రవి, నరేష్, మహేంద్ర తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way