
శింగనమల, అక్టోబర్ 27, జనస్వరం : నియోజకవర్గంలోని గార్లదిన్నె మండలానికి చెందిన కోటంగ గ్రామానికి చెందిన మూలింటి నారాయణస్వామి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణస్వామి మాట్లాడుతూ, “పార్టీ నాపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తాను” అని తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారిని గుర్తించి గౌరవించడం గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. అలాగే, ఈ అవకాశం కల్పించిన వైసిపి జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి, శింగనమల ఇంచార్జి సాకే శైలజానాథ్, పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మూలింటి నారాయణస్వామి నియామకంతో స్థానిక పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది.