Logo
Date of Publish : 22 February 2026, 1:18 am
Editor : Sake Naresh

నెల్లిమర్లలో ప్రజాదర్బార్.. వినతులు విన్న ఎమ్మెల్యే మాధవి

నెల్లిమర్ల, ఫిబ్రవరి 22, (జనస్వరం) : ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి తెలిపారు. శనివారం తన క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాదర్బార్‌కు నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. భూ సమస్యలు, పట్టాదారు పాస్‌పుస్తకాల మార్పులు, చేర్పులు, పింఛన్లు, ఇళ్ల స్థలాలు, సీసీ రోడ్ల పనులు, యువతకు ఉపాధి అవకాశాలపై పలువురు వినతిపత్రాలు అందజేశారు. ప్రతి సమస్యను స్వయంగా విన్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా దరఖాస్తులపై తక్షణ స్పందన ఉండాలని అధికారులకు సూచించారు. సమస్యల తీవ్రతను బట్టి క్షేత్రస్థాయిలో స్వయంగా పర్యవేక్షిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com