సీఎం జగన్ రెడ్డి సమీక్షలో ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కి వచ్చింది సున్నా మార్కులు

– ప్రజలలో తిరిగి మీరు చేసిన అభివృద్ధి తెల్పితేనే మళ్ళీ ఓట్లు పడతాయని సీఎం జగన్ అంటున్నారు

– కానీ తన ముఖం చూసి ఎవరూ ఓటు వేయరు అని తన గురించి అనిల్ బహిరంగంగా చెప్తున్నారు

– పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

      నెల్లూరు సిటీ, (జనస్వరం) : నెల్లూరు సిటీ నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్విరామంగా, నిరాటంకంగా జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 274వ రోజున 47వ డివిజన్ సంతపేటలోని గుప్తా పార్క్ ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికీ వెళ్ళిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను అధ్యయనం చేసి అండగా నిలబడతామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ఒకప్రక్క ఎమ్మెల్యేలు గడప గడపకు తిరిగి తాము చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తేనే వారు మళ్ళీ గెలుస్తారని సీఎం జగన్ రెడ్డి గారు చెప్తుంటే మరోప్రక్క నెల్లూరు సిటీ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా నెగ్గి, ఒకసారి మంత్రిగా పనిచేసిన అనిల్ కుమార్ యాదవ్ మాత్రం తన ముఖం చూసి ఎవరూ ఓటు వేయరని, తనకంత సీన్ లేదని బహిరంగంగా తెల్పుతూ తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. అనిల్ కుమార్ యాదవ్ నగరానికి సంబంధించి ఏమైనా అభివృద్ధి చేసుంటే కదా గడప గడపకు వెళ్ళి చెప్పుకోవడానికి అని దుయ్యబట్టారు. మూడు కాలువల బినామీ కాంట్రాక్టు కోసం పేదల ఇళ్ళను కూడా పగలగొట్టి వందల కోట్లు దోచుకోవడంతో నెల్లూరు సిటీ నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి కుక్కలు చింపిన విస్తరిలా మారిపోయిందని, అందుకే సీఎం జగన్ రెడ్డి సమీక్షలో అనిల్ కుమార్ యాదవ్ కి సున్నా మార్కులు వచ్చాయని అన్నారు. నియోజకవర్గంలో బలమైన శక్తిగా జనసేన పార్టీ మారిందని, పవన్ కళ్యాణ్ పై నగర ప్రజలు అపూర్వ అభిమానాన్ని చూపుతున్నారని, ప్రజలందరి ఆశీస్సులతో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలవబోయేది తామేనని కేతంరెడ్డి వినోద్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way