Search
Close this search box.
Search
Close this search box.

వైసీపీ ప్రభుత్వములో అధికార దుర్వినియోగం శ్రుతిమించుతోంది : చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి దారం అనిత

     మదనపల్లె, (జనస్వరం) : జగన్ రెడ్డి  ప్రభుత్వాన్ని చేపట్టిన తరువాత అధికార దుర్వినియోగం శ్రుతి మించిపోతుందని చిత్తూరు జిల్లా జనసేనపార్టీ ప్రధాన కార్యదర్శి దారం అనిత తెలిపారు. ప్రజల ఇబ్బందులు పట్టకుండా కేవలం తమ నాయకుల, కార్యకర్తల సౌకర్యం మాత్రం చూసుకుంటున్నారని మండిపడ్డారు. శుక్రవారం జరిగిన వైసీపీ ప్లీనరీ సమావేశాలకు రికార్డ్ స్థాయిలో 1812 ఆర్టీసీ బస్సులను ఉపయోగించారు. ప్రైవేట్ కార్యక్రమాలకు ఆర్టీసీ సెక్యూరిటీ డిపాజిట్ తో పాటు అద్దె జీఎస్టీ కలిపి వసూలు చేస్తారు. వైసీపీ ప్లీనరీకి రాష్ట్రవ్యాప్తంగా 1800 కి మించి బస్సులు తీసుకున్న వాటికి డిపాజిట్ చెల్లించలేదని తెలుస్తుంది. అధికారం తమ దగ్గర ఉందని ఇష్టమొచ్చినట్లు ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని మండిపడ్డారు. నిన్న విజయవాడలో సాయంత్రం 5.30 గంటలకు బస్ స్టాండ్ కిటకిటలాడింది కానీ బస్సులన్నీ వైసీపీ ప్లీనరీకి వెళ్లడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ముఖ్యమంత్రి  మీరు పార్టీ మీటింగులు పెట్టుకొంటే ప్రజలెందుకు ఇబ్బందులు పడాలి? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ అధికార దుర్వినియోగాన్ని ప్రజలందరూ ఏకమై ముక్త కంఠంతో ఖండించాలని అనిత తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

WhatsApp Image 2024-07-01 at 8.37
కందుకూరులో ఘనంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం
WhatsApp-Image-2024-06-25-at-4.20
రాచరిక , నియంతృత్వ పోకడల వల్లే వైసీపీ పతనమైంది
IMG-20240416-WA0015
తిరుపతి జనసేన టీడీపీ బీజేపీ నాయకులతో ఎన్నికల సన్నాహక సమావేశం
IMG-20240416-WA0007
ఆటో డ్రైవర్లకు అండగా ఉంటా : ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి
IMG-20240416-WA0004
నడుకూరు గ్రామంలో వైసిపి నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way