మైనర్లుపై మతి లేని దారుణాలు అడ్డుకోవాలి

మైనర్లు

         అనంతపురం ( జనస్వరం ) : పేదరికమే వారి పాలిట శాపంగా మారుతోందని బతుకు మీద ఆశతో పెద్దల ఇళ్ళల్లో పనికి కుదిరితే నరకం చూపిస్తున్నారని.. శనివారం నగరంలోని రెవెన్యూ కాలనీకి చెందిన మైనర్ బాలిక నరకయాతనకు గురై ప్రభుత్వ సర్వజన అస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకొని బాలికను జనసేన-తెలుగుదేశం, ఇతర పార్టీ నాయకులు పరామర్శించారు. జనసేన జిల్లా అధ్యక్షులు, అర్బన్ ఇంచార్జ్ టి.సి.వరుణ్ సమాచారం అందజేశారు. వారి సూచనల మేరకు నగర అధ్యక్షులు పొదిలి బాబురావు గారు మీడియా వారితో మాట్లాడుతూ.. గోరంట్లకు చెందిన ముస్లిం బాలిక పేదరికం కారణంగా న్యాయస్థానంలో భార్య, భర్త ఇరువురు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లైన వారు ఇంటిలో పని మనిషిగా పెట్టుకున్నారు. అమ్మాయిని అతి దారుణంగా వేదించడమే కాక శరీరం పుండులాగా గాయపర్చన్నారు. ప్రభుత్వ అస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలిక భయంతో అరుపులు అక్కడ అందరినీ భాదించాయన్నారు. మైనర్లను పనిలో పెట్టుకొరాదని తెలిసిన కూడా వివిధ శాఖల్లోని అధికారులు, ధనవంతులు బాల,బాలికలతో వెట్టి చాకిరి చేయించుకోవడం పరిపాటిగా మారిందన్నారు. మానవత్వం మరచి దారుణాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాలికపై జరిగిన అఘాయిత్యం అసలు కారుకులను లోతుగా విచారించి చర్యలు తీసుకోవాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way