Logo
Date of Publish : 10 January 2023, 5:37 pm
Editor : Sake Naresh

యువశక్తి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన JSP గ్లోబల్ టీం సభ్యులు

           న్యూస్ ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం వేదికగా ఈ నెల 12న మన యువత మన భవిత అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమం జరుగుతున్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత పడుతున్న బాధలు యువత యువతీ యువకుల సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గళమెత్తునున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మేము సైతం అంటూ JSP గ్లోబల్ టీం సభ్యులు ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందించారు. JSP గ్లోబల్ టీం వ్యవస్థాపకులు వరికూటి సురేశ్ ఆ మొత్తాన్ని పి‌ఏ‌సి చైర్మైన్ నాదెండ్ల మనోహర్ గారికి చెక్ రూపంలో అందించారు. సురేశ్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఇంత మొత్తాన్ని అందించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు జనసేన పార్టీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి JSP గ్లోబల్ టీం అండగా ఉంటుందని వ్యక్తపరిచారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com