Search
Close this search box.
Search
Close this search box.

యువశక్తి కార్యక్రమానికి ఆర్థిక సహాయం అందించిన JSP గ్లోబల్ టీం సభ్యులు

JSP గ్లోబల్ టీం

           న్యూస్ ( జనస్వరం ) : శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలం వేదికగా ఈ నెల 12న మన యువత మన భవిత అనే నినాదంతో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువశక్తి కార్యక్రమం జరుగుతున్న విషయం విదితమే. ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువత పడుతున్న బాధలు యువత యువతీ యువకుల సమస్యలపై జనసేనాని పవన్ కళ్యాణ్ గారు గళమెత్తునున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు, యువత, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొనేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మేము సైతం అంటూ JSP గ్లోబల్ టీం సభ్యులు ఆర్థిక సహాయంగా లక్ష రూపాయలు అందించారు. JSP గ్లోబల్ టీం వ్యవస్థాపకులు వరికూటి సురేశ్ ఆ మొత్తాన్ని పి‌ఏ‌సి చైర్మైన్ నాదెండ్ల మనోహర్ గారికి చెక్ రూపంలో అందించారు. సురేశ్ మాట్లాడుతూ తక్కువ సమయంలో ఇంత మొత్తాన్ని అందించిన సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు జనసేన పార్టీ చేపట్టబోయే ప్రతి కార్యక్రమానికి JSP గ్లోబల్ టీం అండగా ఉంటుందని వ్యక్తపరిచారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way