ఆత్మకూరు, (జనస్వరం) : పవర్ ఆఫ్ యూత్ అధినేత శ్రీపతి రాము ఆధ్వర్యంలో కోట వాకాడు పరిధిలోని ప్రగతి కాలేజ్ లో నోవా బ్లెడ్ బ్యాంక్ వారి సౌజన్యంతో జరిగిన రక్త దాన శిబిరంకి ముఖ్య అతిథిగా ఆత్మకూర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ విచ్చేశారు. ఆయనకి శాలువా కప్పి సన్మానించి శ్రీపతి రాము సాధరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమము నిర్వహించిన పవర్ ఆఫ్ యూత్ అధినేత శ్రీపతి రాము గారిని అభినందించారు. అలాగే కార్యక్రమ నిర్వాహకుడు ఆనం నవీన్ కుమార్ కి, నోవా బ్లెడ్ బ్యాంక్ భవి శెట్టి కిషోర్ కుమార్ గారికి అభినందననలు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో శ్రీపతి రాము, జిల్లా నాయకులు శ్రీనివాస్ భరత్, ఆత్మకూర్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు నాగరాజు యాధవ్, చేజర్ల మండల అధ్యక్షులు అనిల్ రాయల్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సంగం మండల ప్రధాన కార్యదర్శి మదన్ యాదవ్, మర్రిపాడు మండల ప్రధాన కార్యదర్శి సునీల్ యాదవ్, చేజార్ల మండల సంయుక్త కార్యదర్శి అరవింద్ రాయల్ పాల్గొన్నారు.