జగ్గయ్యపేట జనసేన పార్టీ కార్యాలయంలో ఆత్మీయ జనసైనికుల సమావేశం
కృష్ణా జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం జనసేన పార్టీ నియోజకవర్గ సమన్వయ కర్త బాడిశ మురళీకృష్ణ పిలుపు మేరకు నిర్వహించిన సమావేశం లో వత్సవాయి మండల జనసేన పార్టీ ఆఫీస్ లో జనసేన పార్టీ ఆత్మీయ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో మండల నాయకులు కొర్రపాటి గోపీచంద్ మాట్లాడుతూ నియోజకవర్గం లో పార్టీ చాప క్రింద నీరు లాగ పార్టీ విస్తరిస్తుందని అదే మాదిరిగా వత్సవాయి మండలం లో గ్రామ గ్రామాన పార్టీ మరింత బలోపేతం దిశగా ముందుకెళ్లాలని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల లో గెలుపే లక్ష్యం గా ముందుకెళ్లాలని మండల శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. జనసైనికులు మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎవరికి ఏ సమస్య వచ్చినా ముందుగా స్పందించి పరిష్కారం చెప్పేది ఒక్క జనసేన మాత్రమే అని ఆయన అన్నారు. పార్టీలతో, కులాలతో మతాలతో సంబంధం లేకుండా అందరికి సమాన్యాయం చేసేది ఒక్క జనసేన మాత్రమే అని చెప్పారు. కరోనా కష్టకాలంలో జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు జనసేవ కార్యక్రమం ద్వారా ఎంతో మందికి సేవలు చేశామని, అలాగే కరోనా బాధితులకి అండగా దాదాపుగా 640+ ఆక్సిజన్ సిలెండర్లను రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చామని గుర్తు చేశారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం జనసేన పార్టీ సిద్ధాంతాలు అలాగే మండల స్థాయిలో ఉన్న ప్రతి గ్రామ సమస్యలు మరియు పార్టీ బలోపేతానికి జనసైనికులు పిలుపు ఇచ్చారు. ఈ సమావేశంలో మండల నాయకులు కొర్రపాటి గోపి, రామారావు, గణేష్, రవి, గోపి, సుమంత్, లింగ, నవీన్, తదితరులు పాల్గొన్నారు.