Search
Close this search box.
Search
Close this search box.

పవన్ కళ్యాణ్ గారి తిరుపతి పర్యటన గురించి మీడియా సమావేశం

పవన్ కళ్యాణ్

        తిరుపతి ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సోమవారం ఉదయం తిరుపతి ఎస్పీ గారిని కలిసి శ్రీకాళహస్తి నియోజకవర్గంలో పోలీసులు పార్టీ నాయకుడు కొట్టే సాయి గారిపై వ్యవహరించిన తీరును ప్రశ్నించడానికి, వినతి ఇవ్వడానికి రానున్న సందర్భంగా తిరుపతి ప్రెస్స్ క్లబ్ నందు జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గ ఇన్చార్జి శ్రీమతి వినుత కోటా గారు మీడియా సమావేశం నిర్వహించి పర్యటనకి సంభందించిన వివరాలు తెలియజేయడం జరిగింది. సోమవారం ఉదయం 9.30 గం. కు పవన్ కళ్యాణ్ గారు రేణిగుంట విమానాశ్రయం చేరుకోనున్నారు. అనంతరం 10.30 గం. తిరుపతి ఎస్పీ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వనున్నారు. మీడియా సమావేశం అనంతరం తిరుపతి ఎస్పీ గారిని కార్యాలయంలో పవన్ కళ్యాణ్ గారి పర్యటన మరియు రూట్ మ్యాప్ గురించి అడిషనల్ ఎస్పీ గారితో చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఇంఛార్జి కిరణ్ రాయల్ గారు, టౌన్ ప్రెసిడెంట్ రాజా రెడ్డి గారు , శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు దండి రాఘవయ్య గారు, రాష్ట్ర అధికార ప్రతినిధి కీర్తన గారు, జిల్లా కార్యదర్శి కొట్టే సాయి గారు, నాయకులు కృష్ణయ్య గారు, బాబ్జీ గారు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way