పాలకొండ నియోజకవర్గంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ

        పాలకొండ (  జనస్వరం ) : పార్వతిపురం మన్యం జిల్లా పాలకొండ నియోజకవర్గం నాయకులు గర్భాన సత్తిబాబు ఆధ్వర్యంలో రాజిపేట నుండి వీరమహిళలు, జనసైనికులు ర్యాలీగా కవాతు చేసుకొని బాసూరు చేరుకుని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం బహిరంగ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి, రాష్ట్ర కార్యదర్శి శివ దత్త, ప్రచార కార్యదర్శి పాలూరు బాబు, (MPTC) అంపిలి విక్రమ్, ఎచ్చెర్ల నియోజకవర్గ నాయకులు భూపతి అర్జున్, రాజాం నియోజకవర్గం నాయకులు  ఎన్ని రాజు, UP రాజు, ఉత్తరాంధ్ర కోఆర్డినేట్ పైలా లక్ష్మి, గాజువాక వీర మహిళల శాలిని చందక, పాలకొండ మండల నాయకులు గోర్లి.మన్మధ రావు, జామి అనిల్, కిమిడి సురేష్, అలజింగి రాంబాబు, గౌరీ, అల్లు సాయి తదితర జనసైనికులు పాలకొండ నియోజకవర్గ ప్రజలు పాల్గొన్నారు.