రానున్న రోజుల్లో పల్నాడు నుండి జనసేన పార్టీలోకి భారీగా చేరికలు : గుంటూరు జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు

    గుంటూరు, (జనస్వరం) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అరాచక పాలనను అంతమొందించిడానికి జనసేన ఆవిర్భావ సభతో అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు నాంది పలికారని, రానున్న కాలంలో ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలపై పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతాని చెప్పారు. దాచేపల్లి మండలం శ్రీనివాసపురం గ్రామం నుండి 25 మంది వైసిపి, టిడిపి పార్టీలు వీడి జిల్లా పార్టీ కార్యదర్శి అంబటి మల్లి, మండల పార్టీ అధ్యక్షులు దుర్గారావు ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. పల్నాడు ప్రాంతంలో జనసేన బలంగా ఉందని, మరింత బలంగా ప్రజల్లోకి పార్టీని తీసుకెళ్లాలన్నారు. వెనుకబడిన పల్నాడు అభివృద్ధి ఒక్క జనసేనతోనే సాధ్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అడపా మాణిక్యాలరావు, జిల్లా కార్యదర్శి అంబటి మల్లి, దాచేపల్లి అధ్యక్షుడు మందపాటి దుర్గారావు, పిడుగురాళ్ల అధ్యక్షుడు కామిశెట్టి రమేష్, వేల్పుల చైత్యన్య, గురజాల నరసింహ రావు, శ్రీనివాసపురం కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way