Search
Close this search box.
Search
Close this search box.

అమలాపురం నియోజకవర్గములో జనసేనపార్టీ లోకి భారీగా చేరికలు

అమలాపురం

     అమలాపురం, (జనస్వరం) : జనసేన పార్టీ అధ్యక్షులు గౌ. శ్రీ. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి అమలాపురం నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీ శెట్టిబత్తుల రాజబాబు గారి ఆధ్వర్యంలో మండలంలోని అల్లవరం మండలం, రెల్లుగడ్డ గ్రామానికి చెందిన 25 దళిత కుటుంబాల ప్రజలు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శ్రీ శెట్టిబత్తుల రాజబాబు గారిని ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా రాజబాబు గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, సిద్దాంతలు నచ్చి జనసేన పార్టీలోకి చేరడం మంచి శుభపరిణామము అని అన్నారు.  వైసిపి ప్రభుత్వముపై రాష్ట్ర ప్రజలు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు అని అన్నారు. రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఆశయాలు, సిద్దాంతలును ప్రజల్లోకి తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పని చేయాలని ప్రజలకు పిలుపు ఇచ్చారు. ఈ కార్యక్రమములో జనసేన నాయకులు మరియు జనసైనికులు తదితురులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way