Search
Close this search box.
Search
Close this search box.

మద్దికెరలో జనసేనపార్టీలోకి భారీగా చేరికలు

జనసేన

            మద్దికెర ( జనస్వరం ) : పత్తికొండ నియోజకవర్గం మద్దికెర మండలంలో, అశోక్ అధ్యక్షతన జనసేన పార్టీలోకి కండువా కప్పి, పార్టీలోకి చేర్చుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు. జనసేన నాయకులు రాజశేఖర్ మాట్లాడుతూ ఇంత మంది యువత జనసేన పార్టీ అధ్యక్షులు  పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో జనసేన పార్టీ సిద్ధాంతాలకుకు ఆకర్షితులైన యువకులు ఈ రోజు జనసేన పార్టీలో చేరడం ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు మద్దికేర మండలంలో గత జడ్పిటిసి అభ్యర్థిగా మారు గుండు జయరాముడు పోటీ చేశారని, అదేవిధంగా మద్దికేర టౌన్ లో 4MPTCల గాను నాలుగు ఎంపిటిసి అభ్యర్థులుగా పోటీచేసిన గద్దల అజయ్, చిరంజీవి, తిమ్మప్ప, కంబగిరి నాలుగు ఎంపీటీసీగా పోటీ చేశారు. కానీ ఎవరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరికి భయపడకుండా కరడుగట్టిన జనసైనికులు ప్రజాక్షేత్రంలో పోటీ చేసి ఓడారు వీరు ఐదుగురు జనసేన పార్టీకి పంచపాండవుల గా నిలబడి జనసేన సత్తా చాటారు, అదేవిధంగా మద్దికేర టౌన్ లో సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన గద్దల పుల్లమ్మ గద్దల రాజు బలంగా నిలబడి పార్టీకి వెన్నెముకగా నిలిచారన్నారు.  ప్రజాక్షేత్రంలో వీళ్ళందరూ ఓడినా జనసేన పార్టీకి బలం ఉందని నిరూపించారు. పవన్ కళ్యాణ్ గారు మేము ఎప్పుడూ మీకు కష్టమొచ్చినా అండదండగా మేము ఉంటామని మీరందరూ ఎవరికి భయపడకుండా ప్రతి ఒక్కరు ముందుకు రావాలని మీరందరూ మంచి నాయకులుగా ఎదగాలని కోరారు. కులాలకు సంబంధం లేకుండా మనమందరం కలిసికట్టుగా పని చేద్దాం 2024 జనసేన పార్టీ జెండా పత్తికొండ నియోజకవర్గంలో ఎగుర వేద్దామని అన్నారు. ఈరోజు నుంచి మద్దికేర మండలంలో జనసేన పార్టీని ఇంకా బలంగా ముందుకు తీసుకెళ్తామని తెలియజేశారు. పార్టీలోకి జాయిన్ అయిన యువకులు నరేష్, ప్రభాకర్, ఆర్ శంకర్, నాగేష్, వీరేశ్, మనోజ్, రాఘవ, శివ, ఆలం భాష, సుబ్బన్న, అన్వేష్, శ్రీకాంత్, శివ, తరుణ్, మహేష్, అరుణ్ కుమార్, ప్రవీణ్, వీరేశ్ మరియు తదితరులు పాల్గొన్నారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way