గాజువాక 75వ వార్డు నుంచి జనసేన లో భారి చేరికలు

        గాజువాక ( జనస్వరం ) : జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో హరిజనులకు, దళితులకు పెద్ద పీట వేస్తారని ఆశిస్తూ జనసేన పార్టీ రాష్ట్ర పిఏసి సభ్యులు, గాజువాక నియోజవర్గ ఇంచార్జ్ కోనతారావు గారి ఆధ్వర్యంలో 75వ సీనియర్ నాయకులు అంజూరి దీపక్ సమక్షంలో 60 మంది జనసేన పార్టీ లో చేరారు. రాష్ట్రం లో ఎక్కడ చూసినా రాష్ట్ర స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు జనసేన లోకి చేరికలు జరుగుతున్నాయని అన్నారు. గడిచిన 5 ఏళ్ల వైసిపి పాలన లో SC/ST లకు తీవ్రమైన అన్యాయం జరిగిందని, SC/ST కార్పొరేషన్, SC/ST సబ్ ప్లాన్ నుంచి వచ్చే నిధులు వారికి కేటాయించకుండా వైసిపి పథకాలకు దారి మల్లిచారని దుయ్యబట్టారు. దళారీలకు తప్ప సామాన్య ప్రజలకు అందాల్సిన SC/ST రాయితీలు అందటంలేదని, స్వయం ఉపాధి పథకాలు ఆగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో లో అత్యధికంగా దళితులపై తీవ్రమైన దాడులు జరుగాయని, పవన్ కళ్యాణ్ గారికి అధికారం ఇస్తే అన్ని విధాలుగా తమను ఆదుకుంటారనే నమ్మకంతో జనసేన లో చేరినట్లు తెలిపారు. అన్ని వర్గాలకు స్వేచ్చ కల్పిస్తూ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ల ద్వారా వారికి నైపుణ్యాన్ని పెంపొందించి ఉపాధి అవకాశాలు కల్పన కు కృషి చేస్తూ ఆర్థికాభివృద్ధి కి తోడ్పడతామని కోన తాతారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఇందల వెంకట రమణ, కోన చిన అప్పారావు, దాసరి జ్యోతి రెడ్డి, ములకలపల్లి వంశీ, నామాల అర్జున్, కరణం కనకారావు, లంక లతా, గవర సోమశేఖర్, కాద శ్రీను, బలిరెడ్డి అరవింద్ పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

కృష్ణంరెడ్డి పల్లి
కృష్ణంరెడ్డి పల్లి క్రాస్‌లో చలివేంద్రం ప్రారంభం
IMG-20250321-WA0005
కందుకూరు గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు
IMG-20241207-WA0011
కందుకూరు పాఠశాలలో తల్లిదండ్రులు - ఉపాధ్యాయులు సమావేశం
కందుకూరు
కందుకూరులో రాజ్యాంగ ఆమోద దినోత్సవ వేడుకలు
Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way