Search
Close this search box.
Search
Close this search box.

గుంటూరులో పలువురు మహిళలు జనసేనపార్టీలోకి చేరిక

      గుంటూరు, (జనస్వరం) : గుంటూరు జిల్లా జనసేనపార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు, మహిళా కోఆర్డినేటర్ పార్వతీ నాయుడు సమక్షంలో పప్పుల వరలక్ష్మి ఆధ్వర్యంలో పలువురు వీర మహిళలు నూతనంగా పార్టీలో చేరటం జరిగింది. వారందరికీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ జనసేనపార్టీ రోజు రోజుకీ ప్రజల ఆదరణ పొందుతుంది అని అనటానికి ఇదే నిదర్శనం. ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన పప్పుల వరలక్ష్మికి అభినందనలు తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో మా పార్టీకి వీరమహిళలే వెన్నెముకగా ఉండి పార్టీని ముందుండి నడిపించాలని ఆశిస్తున్నాను. జనసేనపార్టీ ఎలాంటి పిలుపునిచ్చిన ఆ కార్యక్రమాలను ముందుండి నడిపించే వీర మహిళలకు కూడా అభినందనలు తెలియజేస్తున్నాము. భవిష్యత్ తరాలకు మా వీరమహిళలు ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటారని గర్వంగా చెప్పటంలో ఎలాంటి అతిశయోక్తి లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులుగా అడపా మాణిక్యాల రావు, నాగదాసు రామచంద్ర ప్రసాద్, కార్పొరేటర్ పద్మావతి, వీరమహిళలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way